సీఎం రిలీఫ్ ఫండ్ కు యువకుడి విరాళం..కేటీఆర్‌ అభినందనలు

సీఎం రిలీఫ్ ఫండ్ కు యువకుడి విరాళం..కేటీఆర్‌ అభినందనలు

కరోనా ను కట్టడి చేసేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చేందుకు స్వచ్చందంగా ముందుకొస్తున్నారు. కరోనాపై పోరాటాని శ్రీకాంత్‌ శరవన్‌ అనే యువకుడు సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.50 వేలు అందించాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌తో చదువుకొని ఉన్నతస్థాయికి చేరుకున్న తాను ప్రజలకోసం కొంత సాయం అందించానని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు… శ్రీకాంత్‌ ట్వీట్‌ చేశారు. ప్రభుత్వ రుణం తీర్చుకొఅవకాశం లభించిందని తెలిపారు.

శ్రీకాంత్ శరవన్ ట్వీట్ పై స్పందించిన కేటీఆర్‌..సాయమందించినందుకు శ్రీకాంత్‌ను అభినందించారు. ఓవర్సీస్‌ పథకం పేద విద్యార్థులకు ఉపయోగపడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

కరోనాకు​ మందు​కనిపెట్టి​పనిలో 35 ల్యాబ్ లు

అమెరికాలో రెండు రోజుల్లో 40 వేల మందికి కరోనా పాజిటివ్‌