శ్రీలంకలో సీతామాత ఆలయం నిర్మించబోతున్నామని చెప్పారు మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్. శ్రీలంకలో సీతామాత పెద్ద ఆలయ నిర్మాణానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తాను ఇటీవలే ఓ స్వామీజీతో మాట్లాడానని చెప్పారు. మధ్యప్రదేశ్, శ్రీలంక అధికారులు, మహాబోధి సొసైటీ ప్రతినిధులతో ఓ కమిటీని నియమిస్తున్నామన్నారు. ఆలయం డిజైన్ త్వరలోనే అప్రూవ్ చేస్తామని.. వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామన్నారు కమల్ నాథ్. హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో నయా రాయ్ పూర్ లో జరిగిన 22వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి వెళ్తూ మీడియాతో మాట్లాడారు కమల్ నాథ్.
see more news