ఓవర్ హెడ్ కరెంట్ వైర్ పై యువకుడు..వీడియో వైరల్

ఓవర్ హెడ్ కరెంట్ వైర్ పై యువకుడు..వీడియో వైరల్

మధ్యప్రదేశ్ లో  రైల్వే ట్రాక్ పై ఉన్న కరెంట్ వైర్ పై నిలబడి ఉన్న ఓ యువకుడిని రైల్వే పోలీసులు రక్షించారు.  దాబ్రా రైల్వే స్టేషన్ వద్ద ఓవర్ హెడ్ వైర్ పై ఓ యువకుడు నిలబడి ఉన్నాడు. అయితే  ఆ సమయంలో  సహాయక చర్యల కోసం అధికారులు  విద్యుత్తును నిలిపివేశారు. కరెంటు తీగలపై నిలబడి ఉన్న యువకుడిని రైల్వే పోలీసులు బలవంతంగా కిందకు దించారు. ఆ యువకుడిని పట్టుకుని  చితకబాదారు . సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన మంగళవారం జరిగింది.

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి