
మెగాస్టార్ స్పీడు పెంచేశారు. వరుసగా సినిమాలు ఒప్పుకోవడమే కాకుండా వాటిని త్వరగా కంప్లీట్ చేసేస్తున్నారు. రీసెంట్గా ‘గాడ్ఫాదర్’గా వచ్చిన చిరంజీవి.. నెక్స్ట్‘వాల్తేరు వీరయ్య’గా రానున్నారు. బాబి డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సినిమాకి సంబంధించి అప్ డేట్స్ చిత్ర యూనిట్ అందిస్తోంది. దీపావళి కానుకగా టైటిల్ టీజర్ని వదులుతున్నట్లు ఇటీవలే వెల్లడించింది.
తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అక్టోబర్ 24, ఉదయం 11.07 గంటలకు ‘బాస్ వస్తున్నాడు’ పోస్టర్ లో పేర్కొన్నారు. పోస్టర్ లో చిరంజీవి ఫేస్ సగం కనిపిస్తోంది. నుదుట రుమాలు కట్టుకుని రౌద్రంగా చూస్తున్నారు. టైటిల్ టీజర్ ఎలా ఉంటుందోనని మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2023 సంక్రాంతికి రిలీజ్ కానుంది.