జనగామ జిల్లా : కడియం గో బ్యాక్

జనగామ జిల్లా : కడియం గో బ్యాక్
  •     స్టేషన్​ ఘన్​పూర్​లో ఎమ్మెల్యే రాజయ్య వర్గీయుల ధర్నా

స్టేషన్​ఘన్​పూర్​, వెలుగు :  ‘‘కడియం గోబ్యాక్​’’ అని,   బీఆర్ఎస్​ టికెట్​ ఎమ్మెల్యే రాజయ్యకే కేటాయించాలని జనగామ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్​లో ఆదివారం ఆయన వర్గీయులు ధర్నా చేశారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్​ ఇవ్వొద్దని బస్టాండ్​ వద్ద అంబేద్కర్​ విగ్రహం ముందు జడ్పీ స్టాండింగ్​ కమిటీ చైర్మన్ మారపాక రవి, సర్పంచ్​ సురేశ్​కుమార్​ ఆధ్వర్యంలో బీఆర్​ఎస్​ నాయకులు నినాదాలు హోరెత్తించారు.

జడ్పీ స్టాండింగ్​ కమిటీ చైర్మన్ మారపాక రవి మాట్లాడుతూ.. ఆనాడు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి టీడీపీ నుంచి బీఆర్​ఎస్​లోకి ఏం త్యాగం చేసి వచ్చారో చెప్పాలని డిమాండ్​చేశారు. కేవలం అధికారం కోసమే ఆయన పార్టీలో చేరారని  ఆరోపించారు. స్టేషన్​ఘన్​పూర్​ నుంచి కడియం వెళ్లిపోవాలని డిమాండ్​ చేశారు. ఎమ్మెల్యే రాజయ్యను లక్ష మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు.

 ధర్నాలో ఎంపీపీ కందుల రేఖ, మార్కెట్​ వైస్​ చైర్మన్​ చల్లా చందర్​రెడ్డి, ఎంపీటీసీలు సింగపురం దయాకర్​, గుర్రం రాజు, బీఆర్​ఎస్​ నాయకులు బొల్లు లక్ష్మి, కుందూరు జ్యోతిరెడ్డి, మారపాక రాములు, గుర్రం శంకర్​, చింత శ్రీను, గోవిందు అశోక్​, తాటికొండ రమేశ్​, ఆకారపు అశోక్​ తదితరులు పాల్గొన్నారు.