మిడ్‌ డే మీల్స్ గుడ్డు ధర రూ.5కు పెంపు

మిడ్‌ డే మీల్స్ గుడ్డు ధర రూ.5కు పెంపు

హైదరాబాద్,వెలుగు: స్కూళ్లలోని పిల్లలకు మిడ్​ డే మీల్స్ స్కీమ్​లో భాగంగా అందించే గుడ్డు ధరను ప్రభుత్వం పెంచింది.  ఈ మేరకు రూ.4 నుంచి రూ.5లకు పెంచుతూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. సోమవారం నుంచే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. వారంలో సోమ, బుధ, శుక్ర మూడు రోజులు, గుడ్డు అందించాలని స్పష్టం చేశారు. మిడ్​ డే మీల్స్ కార్మికుల ఆందోళనల నేపథ్యంలో  గుడ్డు ధర పెంచాలని ప్రభుత్వం నిర్ణయింది.