ఇండియా నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతులు 2018–19లో ఏకంగా 8 రెట్లు పెరిగి రూ. 11,200 కోట్లకు చేరినట్లు ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసియా) వెల్లడించింది. ఏప్రిల్ – జూలై 2019 మధ్య కాలంలో ఈ హ్యాండ్సెట్ ఎగుమతులు రూ. 7 వేల కోట్లని, దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతులు రూ. 25 కోట్లను మించుతాయనే ధీమాను వ్యక్తం చేసింది. 2017–18తో పోలిస్తే మొబైల్ హ్యాండ్సెట్ మాన్యుఫాక్చరింగ్ రంగం 800 శాతం వృద్ధి సాధించినట్లైంది. ఇది అద్భుతమైన ప్రారంభమని ఐసియా ఛైర్మన్ పంకజ్ మొహింద్రూ పేర్కొన్నారు. 2018–19 లో ఇండియాలో మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ యూనిట్ల పరంగా 29 కోట్లకు, విలువ పరంగా రూ. 1.81 లక్షల కోట్లకు చేరింది. 2014–15 లోనైతే కేవలం రూ. 18,900 కోట్ల విలువైన 5.8 కోట్ల యూనిట్లు మాత్రమే ఇక్కడ తయారయ్యాయి. నోకియా ప్లాంట్ మూసివేత తర్వాత ఎగుమతులు దాదాపు శూన్యమైనట్లు ఐసియా తెలిపింది. 2020 నాటికి ఎలక్ట్రానిక్స్ రంగంలో దిగుమతులే ఉండకూడదంటూ 2014 లోనే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2025 నాటికి దేశంలో రూ. 7 లక్షల కోట్ల విలువైన 100 కోట్ల మొబైల్ హ్యాండ్సెట్స్ తయారు కావాలని తాజాగా ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొబైల్ హ్యాండ్సెట్స్ దేశీయ మార్కెట్ డిమాండ్లో దిగుమతుల వాటా ప్రస్తుతం బాగా తగ్గి 6 శాతానికి పరిమితమైందని, ఇది 2014–15 లో 80 శాతంగా ఉండేదని ఐసియా పేర్కొంది. 2018–19 లో తొలిసారిగా మొబైల్ హ్యాండ్సెట్స్ దిగుమతులను మించి ఇండియా ఎగుమతులు నమోదయ్యాయని మొహింద్రూ వెల్లడించారు. 2018–19 లో మొబైల్ హ్యాండ్సెట్స్ దిగుమతులు రూ. 10 వేల కోట్లు. ఎగుమతులు భారీగా పెరగడం ఒక ముఖ్యమైన మైలురాయిగా మొహింద్రూ వ్యాఖ్యానించారు.
మొబైల్ ఫోన్ ఎగుమతులు 8 రెట్లు పెరిగినయ్
- బిజినెస్
- September 26, 2019
లేటెస్ట్
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- IIT JEE అడ్వాన్స్డ్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల
- రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నయ్: మంత్రి శ్రీధర్ బాబు
- Jr Ntr: ఎన్టీఆర్ స్థలం వివాదంలో కొత్త ట్విస్ట్.. అసలు ఆయనకు సంబంధమే లేదట!
- వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి...
- హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
- ఫ్రీబస్ స్కీంను తప్పుబట్టిన మోదీ..కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్
- మోటోరోలా నుంచి కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవిగో
- Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి
- హైదరాబాద్ను వరల్డ్ బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్