లోక్సభ ఎన్నికల్లో ఓటమితో కష్టాల్లో కూరుకుపోయిన సమాజ్వాదీ పార్టీని సుదురాయించే బాధ్యత ములాయం సింగ్ యాదవ్ ఎత్తుకున్నారు. అఖిలేశ్ యాదవ్ నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ పెద్దాయన మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఎస్పీని తిరిగి బలోపేతం చేసేలా, దూరమైపోయిన తమ్ముళ్లను, ఇతర నేతలను సొంతగూటికి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రిజల్ట్స్ తర్వాత మీడియాకు దూరంగా ఉంటున్న అఖిలేశ్, టీవీ డిబేట్లకు వెళ్లొద్దని పార్టీ నేతల్ని ఆదేశించారు. కొద్దిరోజుల కిందటే ఓటమిపై విశ్లేషణ మొదలుపెట్టిన ఆయన, గతానికి భిన్నంగా ఇప్పుడు ప్రతి చిన్నవిషయానికి నేతాజీ సలహాను తీసుకుంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. అఖిలేశ్ అంతా తానై వ్యవహరించిన 2019 లోక్సభ ఎన్నికల్లో ఎస్పీ కేవలం 5 సీట్లలో మాత్రమే గెలవగలిగింది. పార్టీ కంచుకోట మైన్పురిలో ములాయం 95వేల ఓట్ల మెజార్టీతో గెలవగా, మిగతా చోట్ల ఎస్పీ అభ్యర్థులు సాధారణ మెజార్టీతో గట్టెక్కారు. పార్టీకి మునుపటి క్రేజ్ రావాలంటే యాదవనేతల్ని దగ్గరకుతీసుకోవాలని ములాయం సూచించారని, ఆ మేరకు బాబాయి శివపాల్ యాదవ్తో రాజీకి అఖిలేశ్ అంగీకరించారని, అతిత్వరలోనే శివపాల్ తిరిగి ఎస్పీలో చేరతారని సమాజ్వాదీ ముఖ్యనేతలు వెల్లడించారు. శివపాల్ యాదవ్ ఎన్నికల ముందు ప్రగతిశీల్ సమాజ్వాదీ పార్టీ లోహియా(పీఎస్పీఎల్) పేరుతో సొంత పార్టీ పెట్టుకున్న సంగతి తెలిసిందే.
అఖిలేశ్కు…ములాయం దిశానిర్దేశం
- దేశం
- June 3, 2019
లేటెస్ట్
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!