మళ్లీ ఆస్పత్రిలో చేరిన ములాయం సింగ్ యాదవ్

మళ్లీ ఆస్పత్రిలో చేరిన ములాయం సింగ్ యాదవ్

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయంసింగ్ యాదవ్ మరో సారి ఆస్పత్రిలో చేరారు. గత ఐదు రోజుల్లో ఆయన ఆస్పత్రిలో చేరడం ఇది రెండోసారి. నిన్న(ఆదివారం) రాత్రి ఆయన అస్వస్థతకు గురి కావడంతో వెంటనే లక్నోలోని మేదాంత ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ములాయం సోదరుడు శివపాల్ సింగ్ తెలిపారు. విషయం తెలిసిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు.

ఉదరకోశ సమస్యలతో బాధపడుతున్న80 ఏళ్ల ములాయం సింగ్ గత బుధవారం సాధారణ పరీక్షల్లో భాగంగా  ఆస్పత్రికి వెళ్లారు. ఆయనను పరీక్షించిన డాక్టర్లు అడ్మిట్ చేసుకుని చికిత్స అందించారు. మూడు రోజుల చికిత్స తర్వాత శనివారం ములాయంను డిశ్చార్జ్ చేశారు. అయితే… ఒక్క రోజులోనే ఆయన మళ్లీ ఆస్పత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.