చెంప దెబ్బ కొట్టినందుకు చంపేశాడు

చెంప దెబ్బ కొట్టినందుకు చంపేశాడు

మౌలాలి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన మర్డర్ కేసును ఛేదించారు సిటీ పోలీసులు. ఈనెల 1వ తారీకున మౌలాలీ రైల్వే స్టేషన్ సమీపంలో జాషువా శామ్యూల్ అనే వ్యక్తిని దారుణంగా కొట్టి చంపేశారు. హత్య చేసిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. వీరిలో ఒకరు మైనర్ కావడంతో అతన్ని జూవెనైల్ హోమ్ కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిది నెలల క్రితం శామ్యూల్ ఇంట్లో ఫంక్షన్ జరిగింది. ఇందులో చిన్న పాటి తప్పుకు కాస్పర్ తేజ్ ఇమాండి అనే వ్యక్తిని శామ్యూల్ చెంపదెబ్బ కొట్టాడు. ఇది మనసులో పెట్టుకున్న ఇమాండి.. శామ్యూల్ తో స్నేహం నటించి అతన్ని చంపడానికి ఫిక్స్ అయ్యాడు. మే1 వ తేదీన మౌలాలి రైల్వే స్టేషన్ కి దగ్గర్లో ఉన్న చెట్ల దగ్గర మందు తాగడానికి పిలిచాడు. తాగిన తర్వాత శామ్యూల్ ను బండరాళ్లతో కొట్టి చంపాడు ఇమాండి. ఈ నేరంలో ఇమాండికి సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.