చీటింగ్ కేసులో  న్యూస్​ చానెల్ చైర్మన్ అరెస్ట్

చీటింగ్ కేసులో  న్యూస్​ చానెల్ చైర్మన్ అరెస్ట్

షాద్ నగర్, వెలుగు: ఫ్లాట్ లను ఫోర్జరీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్న న్యూస్ చానెల్ చైర్మన్ ను రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తూరులోని సిద్దాపూర్ గ్రామంలో 20 ఎకరాల్లో ఎంస్ఆర్ హౌసింగ్ అండ్  రిసార్ట్స్ పేరుతో ఓ వెంచర్ ను   రోజారాణి  అనే మహిళ ప్రారంభించింది. ఓ న్యూస్ చానెల్ చైర్మన్ సాయి సుధాకర్​ను పార్టనర్​గా చేర్చుకుంది.  రోజారాణి సంతకాన్ని ఫోర్జరీ చేసిన సుధాకర్ 9 ఫ్లాట్లను ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. దీంతో ఆమె  2018లో కొత్తూరు పోలీసులకు కంప్లయింట్ చేసింది. పోలీసులు అతడిపై కేసు ఫైల్ చేశారు. రోజారాణి  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని షాద్ నగర్ ఏసీపీ కుశల్కర్  తెలిపారు.  సుధాకర్ ఫోర్జరీ చేసినట్లు ఫొరెన్సిక్ నుంచి ఇటీవల రిపోర్టు రావడంతో బుధవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్​కి తరలించామన్నారు.