రంగారెడ్డి జిల్లాలోని జన్వాడ దగ్గర ఫామ్ హౌజ్ నిర్మాణంపై కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది ఎన్జీటీ. జన్వాడలో 111 జీవోకు విరుద్ధంగా కేటీఆర్ ఫామ్ హౌజ్ నిర్మించారని NGTలో పిటిషన్ వేశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. దీంతో రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ పై తెలంగాణ ప్రభుత్వం TSPCB, HMDAకు నోటీసులు జారీ చేసింది ఎన్జీటీ. అటు ఫామ్ హౌజ్ నిర్మాణంపై కేంద్ర పర్యావరణ శాఖ నేతృత్వంలో కమిటీ వేసింది. TSPCB, GHMC, వాటర్ వర్క్స్ , HMDA అధికారులతో పాటు… రంగారెడ్డి కలెక్టర్ కమిటీలో సభ్యులుగా చేర్చింది. 2018లో 111 జీవోను పూర్తిగా అమలు చేయాలంటూ సర్కార్ ఇచ్చిన తీర్పు అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో 2 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని కమిటీ ఆదేశించింది.
see more news
కేరళ ఏనుగు హత్య కేసులో తొలి నిందితుడి అరెస్ట్
ప్రపంచ వ్యాప్తంగా 67 లక్షలు దాటిన కరోనా కేసులు
కదులుతున్న ట్రైన్ లో పసికందు..పరుగెత్తి పాల ప్యాకెట్ ఇచ్చిన కానిస్టేబుల్