
హైదరాబాద్ , వెలుగు: కరోనా బులెటిన్ ను శనివారం రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేయ లేదు. ఇప్పటిదాకా రోజూ ఇస్తున్న బులెటిన్ ఫార్మాట్ లో మార్పులు చేస్తున్నందున బులెటి న్ ఇవ్వడం లేదని, అసౌకర్యానికి చింతిస్తున్నామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ మీడియాకు వివరించారు. శుక్రవారం 1,640 మందికి పాజిటివ్ రాగా.. మొత్తం కేసుల సంఖ్య 52,466గా ఉంది. ఇప్పటిదాకా 455 మంది చనిపోయారు. ఆదివారం ప్రకటించే బులెటిన్ లో కేసుల సంఖ్యను ఎక్కువగా చూపించే అవకాశం ఉంది.