- ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఉత్తుత్తి లెక్చరర్లు
- పైసలు మిగుల్చుకునేందుకు మేనేజ్మెంట్ల కొత్త ప్లాన్
- పైసలిచ్చి ఫేక్ఫ్యాకల్టీతో బయోమెట్రిక్ హాజరు
ఇబ్రహీంపట్నంలో ఉన్న ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో 160 మందికి పైగా లెక్చరర్లు ఉన్నారు. వీరిలో 50 మందికి పైగా లెక్చరర్లు కాలేజీలో ఉండరు.. పాఠాలు చెప్పరు. ఉదయం, సాయంత్రం వచ్చి బయోమెట్రిక్ అటెండెన్స్ వేసి పోతుంటారు. మేనేజ్మెంట్ వారికి నెలకు రూ.10 వేల చొప్పున ఇస్తోంది. టెక్నికల్ కాలేజీల్లో పూర్తి స్థాయి ఫ్యాకల్టీ ఉండాలని ఏఐసీటీఈ, యూనివర్సిటీలు పెట్టిన రూల్స్తప్పించుకోడానికి.. మెజార్టీ కాలేజీల మేనేజ్మెంట్లు ఇలా.. థంబ్ లెక్చరర్ల విధానానికి తెర లేపాయి.
హైదరాబాద్, వెలుగు: టెక్నికల్ కాలేజీల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ఏఐసీటీఈ, యూనివర్సిటీలు పెడ్తున్న రూల్స్ను మేనేజ్మెంట్లు పట్టించుకోవడం లేదు. ఖర్చు తగ్గించుకునేందుకు కొత్త దారి వెతుకుతున్నాయి. రాష్ట్రంలో 530కి పైగా ప్రైవేటు టెక్నికల్ కాలేజీలుండగా వాటిల్లో 40 వేలకు పైగా టీచింగ్ ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. రూల్స్ ప్రకారం ఒక్కో టెక్నికల్ కాలేజీలో డిపార్ట్మెంట్కు ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ సహా కనీసం 80 మందికి తగ్గకుండా ఫ్యాకల్టీ ఉండాలి. కానీ ఒక్క కాలేజీలోనూ ఫ్యాకల్టీ లేరు. దీనిపై విమర్శలు రావడంతో ఏఐసీటీఈ గైడ్లైన్స్ప్రకారం.. వర్సిటీలు కాలేజీల్లో ఫ్యాకల్టీకి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయడంతో ఫ్యాకల్టీని పెట్టుకోవాల్సి వచ్చింది. ఖర్చు తగ్గించుకునేందుకు కొంత మంది ఫ్యాకల్టీనే నియమించుకున్న మేనేజ్మెంట్లు.. తమ కాలేజీల్లో పూర్తి స్థాయి ఫ్యాకల్టీ ఉందని చూపించేందుకు.. థంబ్ లెక్చరర్ల విధానం తీసుకొచ్చింది.
థంబ్ వేసిపోతే పది వేలు..
ప్రస్తుతం దాదాపు మెజార్టీ ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో థంబ్ ఫ్యాకల్టీ విధానం నడుస్తోంది. ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్ హాజరు వేసిపోతున్న థంబ్ లెక్చరర్లకు ఆయా మేనేజ్మెంట్లు నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల చొప్పున ఇస్తున్నాయి. వీరంతా వేర్వేరు ఉద్యోగాలు చేస్తూ, మేనేజ్మెంట్లు ఇచ్చే రెమ్యునరేషన్ కోసం ఇలా హాజరు వేసిపోతుంటారు.
స్టూడెంట్లకు నష్టం..
టెక్నికల్ కాలేజీల మేనేజ్మెంట్లు పూర్తి స్థాయిలో రెగ్యులర్ ఫ్యాకల్టీని పెట్టుకుంటే ఒక్కో లెక్చరర్కు నెల నెలా రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు జీతం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఖర్చు తగ్గించుకోవడం కోసం.. థంబ్లెక్చరర్ల విధానం నడిపిస్తుండటంతో స్టూడెంట్లకు నష్టం జరుగుతోంది. ఉన్న ఫ్యాకల్టీతోనే రెండు నుంచి మూడు క్లాసులు చెప్పిస్తుండటంతో క్వాలిటీ దెబ్బతింటోంది. ల్యాబ్లనూ వేరే కొత్తవారితో చేయిస్తున్నారు.
తనిఖీలు చేపట్టాలె
ప్రైవేటు కాలేజీల్లో బయోమెట్రిక్ హాజరు విధానంపై వర్సిటీ అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలె. రెగ్యులర్ఫ్యాకల్టీని పెట్టుకోకుండా.. థంబ్లెక్చరర్లతో నడిపిస్తున్న కాలేజీలను గుర్తించాలి. కొన్ని కాలేజీల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ అమలైతలేదు. జేఎన్టీయూ, ఓయూతో పాటు అన్ని వర్సిటీలు ఇలాంటి ఫేక్ ఫ్యాకల్టీని గుర్తించి చర్యలు తీసుకోవాలె. - సంతోష్కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, టీఎస్టీసీఈఏ