ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రా
జైనూర్,వెలుగు: ఏజెన్సీలో ఐటీడీఏ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఉట్నూర్ ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రా చెప్పారు. జైనూర్లో ఏర్పాట్ చేసిన పెట్రోల్ బంక్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఐటీడీఏ ద్వారా గిరిజనులకు ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒక బంక్ ద్వారా ఎనిమిది కుటుంబాలకు ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జీసీసీ డీఎం ఎల్కే రామనాయక్, ఐవోసీఎల్ సురేశ్, జీసీసీ మెనెజర్ గులాబ్సింగ్ ఆదివాసీ నాయకులు మెస్రం అంబాజీరావు, కుడమెత యశ్వంత్రావు తదితరులు ఉన్నారు.