​ఐటీడీఏ ఆధ్వర్యంలో పెట్రోల్ ​​బంక్​లు

​ఐటీడీఏ ఆధ్వర్యంలో పెట్రోల్ ​​బంక్​లు

ఐటీడీఏ పీవో భవేశ్​ మిశ్రా

జైనూర్​,వెలుగు: ఏజెన్సీలో ఐటీడీఏ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్​లు ఏర్పాటు చేస్తున్నట్లు ఉట్నూర్​ ఐటీడీఏ పీవో భవేశ్​ మిశ్రా చెప్పారు. జైనూర్​లో ఏర్పాట్​ చేసిన పెట్రోల్ బంక్​ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఐటీడీఏ ద్వారా గిరిజనులకు ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒక బంక్​ ద్వారా ఎనిమిది కుటుంబాలకు ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జీసీసీ డీఎం ఎల్​కే రామనాయక్​, ఐవోసీఎల్​ సురేశ్​​, జీసీసీ మెనెజర్​ గులాబ్​సింగ్​ ఆదివాసీ నాయకులు మెస్రం అంబాజీరావు, కుడమెత యశ్వంత్​రావు తదితరులు ఉన్నారు.