కరోనా మరణాల రేటును తగ్గించడంలో ప్లాస్మా థెరపీ పెద్దగా ఉపయోగకరంగా లేదని భారత వైద్య పరిశోధన మండలి (ICMR )తెలిపింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 22 నుంచి జూలై 14 మధ్య 29 కరోనా చికిత్సా కేంద్రాల్లో 464 మందిపై పరిశోధన జరిపిన తర్వాత ఈ విషయాన్ని ప్రకటించింది. అంతేకాకుండా ఈ ప్లాస్మా థెరపీ విధానం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కూడా అంతగా ప్రభావం చూపలేదని తెలిపింది. అయితే చికిత్సకు ముందు దాత, రోగిలో యాంటీబాడీల సంఖ్యను లెక్కించడంతో ఈ థెరపీ ప్రయోజనంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పింది. కరోనా పేషెంట్ల ప్రాణాలు కాపాడేందుకు ప్లాస్మా థెరపీ ఉపయోగకరంగా ఉంటుందని దేశ వ్యాప్తంగా బాగా ప్రచారం జరిగింది. దీనిపై కొందరు నిపుణులు కూడా ఇదే విషయాన్ని తెలిపారు. ప్రముఖులు, సెలబ్రిటీలతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు కూడా చేయించాయి. కేంద్రం కూడా కొంత స్థాయిలో లక్షణాలున్న రోగులకు ప్లాస్మా థెరపీ చేయొచ్చని ప్రకటించింది. అయితే ప్లాస్మా థెరపీ ఉపయోగకరంగా లేదని ICMR రీసెర్చ్ లో తేల్చడంతో…కరోనాను అరికట్టవచ్చని ఇప్పటి వరకు ఉన్న నమ్మకం కూడా పోయిందంటున్నారు నిపుణులు.
ప్లాస్మా థెరపీతో కరోనా మరణాలను తగ్గించలేము: ICMR
- దేశం
- September 10, 2020
లేటెస్ట్
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో