లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు కేంద్రం అండగా నిలుస్తోంది. ఈ సమయంలో ఆకలితో ఇబ్బంది పడకుండా నిత్యావసరాల కొనుగోలుకు డైరెక్ట్ గా నగదు సహాయం అందిస్తోంది. ఇందుకోసం పలు పథకాల కింద దాదాపు రూ. 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. పీఎం కిసాన్ పథకం ద్వారా దేశంలోని దాదాపు 7 కోట్ల మంది రైతులకు వారి బ్యాంక్ అకౌంట్ లో రూ. 2000 జమచేసింది. రూ. 13, 855 కోట్ల రూపాయలు వారికి అందజేసింది. జన్ ధన్ యోజన ఖాతా ఉన్న ప్రతి మహిళ అకౌంట్ లో రూ. 500 జమచేసింది. దాదాపు 20 కోట్ల మందికి ఈ ప్రయోజనం అందింది. నేషనల్ సోషల్ అసిస్టె న్స్ ప్రొగ్రాం ద్వారా 2.82 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఖాతాలో డెరెక్ట్ గా రూ. 1000 జమ చేసింది. 2.16 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికు లకు రూ. 3066 కోట్లనగదు సహాయం అందించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రతి కుటుంబానికి 5 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా అందించనుంది. ఉజ్వల స్కీమ్ కింద వచ్చే మూడు నెలల పాటు 8.3 కోట్ల మంది మహిళలకు ఉచితంగా సిలిండర్ అందజేయనున్నారు . కరోనా కారణంగా ఉపాధి లేని వారిని ఆదుకునేందు కు ఈ సహాయం అందిస్తున్నామని కేంద్రం తెలిపింది. ఇప్పటికే రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది.
కరోనా క్రైసిస్ లో ప్రజలకు అండగా.. పథకాల కింద 30వేల కోట్లు ఖర్చు చేస్తున్న కేంద్రం
- దేశం
- April 14, 2020
లేటెస్ట్
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో