రామ మందిర నిర్మాణం కోసం రాష్ట్ర‌ప‌తి విరాళం

రామ మందిర నిర్మాణం కోసం రాష్ట్ర‌ప‌తి విరాళం

న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిర నిర్మాణానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విరాళమిచ్చారు. రామాలయం కోసం రూ. 5,00,100 (5 లక్షలు) విరాళంగా అందించారు. ఈ మేరకు విశ్వహిందు పరిషత్ ప్రకటన విడుదల చేసింది. వీహెచ్‌పీ సభ్యులు అశోక్ కుమార్ మాట్లాడుతూ.. దేశ తొలి పౌరుడిగా ఆయన నుంచే విరాళాల సేకరణ ప్రారంభించాలని భావించామని చెప్పారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్త విరాళాల సేకరణను గురువారం ప్రారంభించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ విరాళాల సేకరణ వచ్చే నెల 27 వరకు కొనసాగుతుంది. స్వచ్ఛంద విరాళాల సేకరణ ద్వారానే రామ మందిరం నిర్మాణం జరుగుతుందని గతంలో ట్రస్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే.