రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుక్షాకాంక్షలు చెప్పారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతమన్నారు. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు రాష్ట్రపతి కోవింద్. తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్ దిశగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ కోవింద్ ట్వీట్ చేశారు.
తెలంగాణ ఘనమైన చరిత్ర, సహజ వనరులతో పాటు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతితో దేశాభివృద్ధిలో తెలంగాణ తన వంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన వెంకయ్య నాయుడు.. రాష్ట్రం మరింత సమృద్ధిని సాధించాలని ట్వీట్ చేశారు.