బీ అలర్ట్ : మే 4 వరకు తెలంగాణలో వడగాలులు

బీ అలర్ట్ : మే 4 వరకు తెలంగాణలో వడగాలులు

భారత వాతావరణ శాఖ తెలంగాణకు హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో మే 4వ తేదీ వరకు వడగాలులు వీస్తాయని హైదరాబాద్‌ ఐఎండీ హెచ్చరించింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున ఈ మేరకు అలర్ట్ ప్రకటించింది.

తెలంగాణలో ఈ జిల్లాలో రేపు వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లె, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ లో వేడిగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.

మే 2న, హైదరాబాద్‌, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లె, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌   తెలంగాణ జిల్లాలతో సహా, హన్మకొండ, వరంగల్. భూపాలపల్లి జిల్లాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ. శుక్ర, శనివారాల్లో ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురం భీమ్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లె, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

హైదరాబాద్ కి ఆరెంజ్ అలర్ట్..

 ఐఎండీ హైదరాబాద్ నగరానికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌లో నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, సోమవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటాయని తెలిపింది. నల్గొండ జిల్లాలో 45.5 డిగ్రీల సెల్సియస్‌, ములుగులో 45.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది.