రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన రద్దయ్యింది. మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము రావాల్సి ఉండగా... భారీవర్షాల నేపథ్యంలో పర్యటన రద్దు చేసుకున్నారు.
ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు రానున్నట్లు శనివారం వెల్లడించారు. జులై 12న మంగళవారం ఆమె బేగంపేట విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. ఈ పర్యటనలో ద్రౌపది ముర్ము తెలంగాణ మేధావులతో సదస్సులో పాల్గొనాల్సి ఉంది. అటు ద్రౌపది ముర్ముకు ఘనంగా స్వాగతం పలకాలని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్లాన్ కూడా చేసుకున్నారు. భారీ ర్యాలీ చేపట్టాలని భావించారు. కానీ తాజాగా ద్రౌపది ముర్ము పర్యటన రద్దు కావడంతో.. బీజేపీ నేతలు నిరుత్సాహానికి గురయ్యారు.