దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఒక రోజు నిలకడగా ఉన్న తర్వాత ఇవాళ ( గురువారం) మెట్రో నగరాల్లో మళ్లీ ధరలు పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు సుమారు 10 పైసలు చొప్పున పెరగ్గా, డీజిల్ రేట్లు యథాతథంగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్లో పెట్రోలు ధర లీటరుకు 85 రూపాయల మార్క్ ను దాటేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు లీటరుకు 81.83 కు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ .88.48 గా ఉంది. కోల్కతాలో 83.33 రూపాయలు, బెంగళూరులో 84.49 రూపాయలు, హైదరాబాద్లో లీటరుకు 85.04 రూపాయలు.
మరోవైపు డీజిల్ ధర ఢిల్లీలో లీటరుకు 73.56 రూపాయలు, ముంబైలో 80.11రూపాయలు, చెన్నైలో 78.86 రూపాయలు, కోల్కతాలో 77.06 రూపాయలు, హైదరాబాద్లో లీటరుకు రూ 80.17 రూపాయలు.