ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. ప్రయాణీకులకు గాయాలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. ప్రయాణీకులకు గాయాలు

హైద్రాబాద్ జూపార్కు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. SST ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదం సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో పలువురికి గాయాలయ్యాయి. బాధితులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవ్ చేసినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.