అరెస్ట్ చేసిన సైబర్ క్రైం పోలీసులు
హైదరాబాద్ (నాంపల్లి), వెలుగు: పబ్జీ గేమ్ ప్రాణాలు తీయడమే కాదు, అమ్మాయిలపై లైంగిక వేధింపులకూ కారణమవుతోంది. అలాంటి ఘటనే హైదరాబాద్లోని నాంపల్లిలో వెలుగు చూసింది. ఓ అమ్మాయి తల్లిదండ్రులు సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, నిందితుడు ఊచలు లెక్కబెడుతున్నాడు. కేసు వివరాలను సైబర్ క్రైం ఏసీపీ ప్రసాద్ వెల్లడించారు. టోలిచౌకికి చెందిన ఓ బాలిక (14) పబ్జీ గేమ్ ఆడుతుండేది. ఆ క్రమంలోనే నాంపల్లికి చెందిన బైక్ మెకానిక్ సల్మాన్ఖాన్ (22) అనే యువకుడు ఆన్లైన్లో ఆమెను ట్రాప్ చేశాడు. బాలిక నెంబర్ తీసుకున్నాడు. రోజూ వాట్సాప్లో చాటింగ్ చేయడంతో ఇద్దరి మధ్యా చనువు పెరిగింది. ఆ చనువుతోనే అమ్మాయి పర్సనల్ ఫొటోలను వాట్సాప్ ద్వారా తీసుకున్నాడు. ఆ ఫొటోలను అడ్డం పెట్టుకుని కోరిక తీర్చాలని, లేకపోతే సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఫోన్ నంబర్ ఆధారంగా సల్మాన్ను శనివారం అరెస్ట్ చేశారు.