జూబ్లీహిల్స్ పీఎస్​లో సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కంప్లయింట్

జూబ్లీహిల్స్ పీఎస్​లో సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కంప్లయింట్

జూబ్లీహిల్స్, వెలుగు: ‘లైగర్’ సినిమా డిస్ట్రిబ్యూటర్ల నుంచి తనకు ప్రాణ హాని ఉందని సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఆయన మాట్లాడుతూ.. లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ వరంగల్ శ్రీను, శోభన్ బాబు తనను, కుటుంబాన్ని వేధిస్తున్నారన్నారు.

లైగర్ సినిమాతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లంతా గురువారం తన ఇంటి ముందు ఆందోళనకు సిద్ధమై పరువు తీసేందుకు కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెప్పినప్పటికీ కొందరు డిస్ట్రిబ్యూటర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ జూబ్లీహిల్స్ పీఎస్​లో ఆయన కంప్లయింట్ చేశాడు.