సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. పోస్టర్ రిలీజ్ చేసిన సీపీ

సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. పోస్టర్ రిలీజ్ చేసిన సీపీ

ఎల్​ బీనగర్,వెలుగు: సంక్రాంతి పండుగకి సొంతూళ్లకు వెళ్లేవారు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ అన్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్​ను సోమవారం ఎల్​బీనగర్ లోని కమిషనరేట్ క్యాంప్ ఆఫీసులో ఆయన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మహేశ్​భగవత్ మాట్లాడుతూ.. ఊరికెళ్లేటప్పుడు విలువైన వస్తువులు, బంగారం, క్యాష్​ను ఇంట్లో పెట్టొద్దన్నారు. ఇంట్లోని ఓ రూమ్​లో లైట్ వేసి ఉంచాలన్నారు. ఊరికెళ్తు న్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు చేయొద్దన్నారు. వెళ్లే ముందు స్థానిక పీఎస్​లో సమాచారం అందిస్తే ఆయా ఏరియాల్లో పోలీస్ గస్తీని పెంచుతామన్నారు.