కాంగ్రెస్ ప్రెసిడెంట్పదవికి రాజీనామా చేసే విషయంలో రాహుల్గాంధీ మనసు మార్చేందుకు చివరి ప్రయత్నంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రంగంలోకి దిగారని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఇంతకు ముందు సీడబ్ల్యూసీ వారించినా, పార్టీ నేతలు రాజీనామాలు చేసినా రాహుల్ వెనక్కితగ్గని సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సీఎంలు అశోక్ గెహ్లాట్(రాజస్థాన్), అమరీందర్ సింగ్(పంజాబ్), కమల్నాథ్(మధ్యప్రదేశ్), భూపేష్ బాగేల్ (ఛత్తీస్గఢ్), నారాయణస్వామి(పుదుచ్చేరి) సోమవారం ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. హార్ట్ టు హార్ట్ అన్నంత క్లోజ్గా తమతో రాహుల్ రెండు గంటలపాటు మాట్లాడారని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఏం కోరుకుంటున్నారో వివరించినట్లు అశోక్ గెహ్లాట్ మీడియాకు తెలిపారు. మోడీ సర్కార్ తప్పుల్ని ఎత్తిచూపడంతోపాటు బీజేపీతో ఐడియాలజికల్ ఫైట్ చేయగల సత్తా ఒక్క రాహుల్ గాంధీకే ఉందని, ప్రస్తుత పొలిటికల్ సిట్యువేషన్లో ఆయన మాత్రమే పార్టీని నడిపించగలరన్న గెహ్లాట్.. ఇదే అభిప్రాయాన్ని రాహుల్కు కూడా చెప్పామని, ప్రెసిడెంట్గా కొనసాగాలని రిక్వెస్ట్ చేశామని వివరించారు. తన రిక్వెస్ట్ని రాహుల్ అంగీకరిస్తారన్న నమ్మకం ఉందన్నారు. గత ఐదేండ్లలో అన్ని రకాలుగా ఫెయిలైన మోడీ.. నేషనలిజం, రిలీజియన్ పేరుతో ఓట్లు అడిగారని, రాహుల్ ఒక్కరే రియల్ ఇష్యూలపై మాట్లాడారని గెహ్లాట్ గుర్తుచేశారు. రాహుల్ తప్పుకోవడం ఖాయమని, ఆయన మనసు మార్చేందుకు సీఎంలు చేసిన ప్రయత్నమే చివరిదని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలాఉంటే, కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంఘాల ఆఫీస్ బేరర్ల రాజీనామాలు సోమవారం కూడా కొనసాగాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే వందలమంది నేతలు పదవులు వదులుకున్నారు.
ఎదురుదాడి చెయ్యండి: రాహుల్
జమ్మూకాశ్మీర్లో పరిస్థితులపై ఆ రాష్ట్ర నేతలతో చీఫ్ రాహుల్ మీటింగ్ నిర్వహించారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే సమాయత్తంకావాలని, బీజేపీ ఫెయిల్యూర్స్పై ఎదురుదాడి చేయాలని నేతలకు రాహుల్ సూచించారు. అమర్నాథ్ యాత్ర గురించి ఆయన ఆరాతీశారు. ఢిల్లీలోని రాహుల్ నివాసంలో జరిగిన సమావేశంలో గులాం నబీ ఆజాద్, అంబికా సోని, కేసీ వేణుగోపాల్, జమ్మూకాశ్మీర్ ఇన్చార్జి షకీల్ అహ్మద్, జేకేపీసీసీ చీఫ్ జీఏ మిర్ పాల్గొన్నారు.