‘జల్సా’ ట్రైలర్‌‌ను విడుదల చేసిన సాయి ధరమ్ తేజ్

‘జల్సా’ ట్రైలర్‌‌ను విడుదల చేసిన సాయి ధరమ్ తేజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’ (Jalsa) మళ్లీ విడుదల చేయడం ఏంటీ అని అశ్చర్యపోతున్నారా ? ఈ మధ్య టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. గతంలో రిలీజ్ బిగ్ హిట్ సాధించిన సినిమాలను మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. హీరోల పుట్టిన రోజు సందర్భంగా సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలను 4k ప్రింట్ తో విడుదలవుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘ఒక్కడు’, ‘పోకిరి’ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ‘ఘరానా మొగుడు’ చిత్రాలు రీ రిలీజ్ చేశారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జన్మదినం సందర్భంగా ‘జల్సా’  మూవీని సెప్టెంబర్ 01న విడుదల చేస్తున్నారు. మాటల మాంత్రికుడు ‘త్రివిక్రమ్’ తెరకెక్కించారు. పవన్ సరస ఇలియాన నటించారు. నటుడు సాయి ధరమ్ తేజ్ చిత్ర ట్రైలర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. రీ రిలీజ్ పై ఆనందం వ్యక్తం చేశారు. మహేష్ బాబు చెప్పే మాటలతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. సన్నివేశాలను ఎడిట్ చేసిన తీరు పవన్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. సినిమా వచ్చి 14 ఏళ్లు అయినా... పవర్ తగ్గలేదు అనిపించేలా ట్రైలర్ ఉంది.