SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులకు అదనంగా రూ.2వేలు

SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులకు అదనంగా రూ.2వేలు

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలో భాగంగా అనేక దేశాలు  లాక్ డౌన్ ని ప్రకటించారు. దీంతో అన్నిప్రభుత్వ కార్యాలయాలతో పాటు…ప్రైవేట్ ఆఫీసులు కూడా మూతపడ్డాయి. కొన్ని కంపెనీలు వారి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చాయి. అయితే బ్యాంకు ఉద్యోగులు మాత్రం విధులకు హాజరవుతూ వినియోగదారులకు తమ సేవలందిస్తున్నారు. లాక్ డౌన్ లో కూడా వర్క్ చేస్తున్న SBI, బ్యాంక్  ఆఫ్ బరోడా ఉద్యోగులకు అదనంగా ఆర్ధిక ప్రయోజనాన్ని ప్రకటించాయి బ్యాంకులు.

మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్‌ 14వ తేదీ మధ్య కాలంలో విధులు నిర్వహించిన వారికి రూ.2వేలను అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించాయి. దేశీయ అతిపెద్ద బ్యాంక్‌  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI) తమ బ్యాంకు అన్ని శాఖల్లో సేవందిస్తున్న వారికి ఈ మొత్తం అందజేయనున్నట్లు తెలిపింది.

బ్యాంక్‌ ఆఫ్ బరోడా యాజమాన్యం కూడా తమ సిబ్బంది మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఈ మొత్తం అందజేస్తున్నట్లు తెలిపింది. అలాగే రోజుకి కనీసం 5 ట్రాన్సాక్షన్లు నిర్వహించిన బీసీ ఏజెంట్లకు రూ.100 అందించనున్నట్లు చెప్పింది.