యాంటీ సీఏఏ నిరసనలపై కేరళ సీఎం వార్నింగ్ తిరువనంతపురం: సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్(సీఏఏ)కు వ్యతిరేక ఆందోళనల్లో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్ డీపీఐ) వంటి శక్తులు చొరబడి హింసను ప్రేరేపించే ప్రమాదం ఉందని కేరళ సీఎం పినరయి విజయన్ హెచ్చరించారు. తమ ప్రభుత్వం వాటిని ఎట్టి పరిస్ థితుల్లోనూ ఉపేక్షించదన్నారు. శాంతియుత ఆందోళనల విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరంలేదని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. ఆందోళనకారులపై కేసులు పెట్టి వేధిస్తున్నారన్న యూడీఎఫ్ ఆరోపణలను సీఎం కొట్టి పారేశారు.