ప్రగతిభవన్ కు చేరిన కడియం, తాటికొండ పంచాయతీ

ప్రగతిభవన్ కు చేరిన కడియం, తాటికొండ పంచాయతీ

స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వివాదం సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరింది. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే రాజయ్య, కడియం శ్రీహరి మధ్య తీవ్ర స్థాయిలో వార్ జరుగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. బహిరంగంగా సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకోవడంతో పార్టీ క్యాడర్ లో గందరగోళం నెలకొంది. 2 రోజుల క్రితం కడియం కులం, అవినీతిపై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే రాజయ్య. దీనిపై నిన్న ప్రెస్ మీట్ మరీ కౌంటర్ ఇచ్చారు కడియం శ్రీహరి. ఇద్దరి మధ్య పంచాయతీతో రాజయ్యకు ప్రగతి భవన్ నుంచి పిలుపొచ్చింది.