
నందు, రష్మి జంటగా రాజ్ విరాట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, మద్ది ఆనంద్ రెడ్డి, యెడ మనోహర్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. రీసెంట్గా ట్రైలర్ను సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు మారుతి లాంచ్ చేసి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరారు. నందు మాట్లాడుతూ ‘ఏ బ్యాగ్రౌండ్ లేని నాకు ప్రేక్షకులే సపోర్ట్గా నిలిచారు. ఈ సినిమా కోసం రష్మి చాలా కష్ట పడింది. తనకి ఒక్క థ్యాంక్స్ చెబితే సరిపోదు.
సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన నిర్మాతలకు థ్యాంక్స్’ అని చెప్పాడు. మంచి కథతో వస్తున్న ఈ సినిమా.. టీమ్ అందరికీ పేరు తీసుకొస్తుందన్న నమ్మకం ఉందంది రష్మి. దర్శకుడు మాట్లాడుతూ ‘ఆల్రెడీ విడుదల చేసిన పాటలకు, టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అన్నాడు. యాక్టర్స్తో పాటు, టెక్నీషియన్స్ కూడా తమకు బాగా సపోర్ట్ చేశారన్నారు నిర్మాతలు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్. విహారి, నటుడు కిరీటి తదితరులు కూడా పాల్గొన్నారు.