హైదరాబాద్/మందమర్రి, వెలుగు: రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత లేదని, విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి అంతరాయం లేదని సింగరేణి ప్రకటించింది. సింగరేణితో ఒప్పందం చేసుకున్న అన్ని రాష్ట్రాల ప్లాంట్లకు అవసరమైన మేరకు బొగ్గు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నామని సంస్థ డైరెక్టర్లు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జనరేటింగ్ స్టేషన్లలో కనీసం ఐదు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్.చంద్రశేఖర్ , డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్.బలరామ్లు బొగ్గు ఉత్పత్తి, రవాణాపై అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేశారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్టోబరు నెలలో రోజూ 1.9 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని, కనీసం 34 రేక్లకు తగ్గకుండా రవాణా చేయాలన్నారు. కొత్తగూడెం ఏరియా నుంచి ప్రతీ రోజూ 7 రేక్లు, ఇల్లందు నుంచి 5 రేక్లు, మణుగూరు 5, ఆర్జీ-1 నుంచి 1 రేక్, ఆర్జీ-2 ఏరియా నుంచి 7 రేక్లు, బెల్లంపల్లి నుంచి 1 రేక్, మందమర్రి నుంచి 3 రేక్లు, శ్రీరాంపూర్ నుంచి 5 రేక్ల చొప్పున బొగ్గు రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సింగరేణి తో ఒప్పందం చేసుకున్న థర్మల్ స్టేషన్లు టీఎస్ జెన్కో (తెలంగాణ), ముద్దనూరు ఏపీ జెన్కో, పర్లీ మహా జెన్కో (మహారాష్ట్ర), రాయచూర్ కెపిసీఎల్ (కర్ణాటక), మెట్టూర్ టాన్ జెడ్కో (తమిళనాడు), రామగుండం ఎన్టీపీసీకి, సింగరేణి థర్మల్ ప్లాంట్తో పాటు బ్రిడ్జ్ లింకేజీ కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని వీటీపీఎస్, మహారాష్ట్ర లోని కొరడి, షోలాపూర్ ఎన్టీపీసీ, కర్ణాటకలోని ఎరమరాస్ తదితర విద్యుత్ కేంద్రాల అవసరాల మేరకు బొగ్గు సరఫరా చేయాలని స్పష్టం చేశారు. సింగరేణి రోజూ ఉత్పత్తి చేసే బొగ్గు లో 86 శాతం అంటే1.5 లక్షల టన్నులను థర్మల్ కేంద్రాలకే సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఈ వీడియో సమీక్షలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జె.ఆల్విన్, జీఎం (కో ఆర్డినేషన్) కె.సూర్యనారాయణ, జీఎం (మార్కెటింగ్) కె.రవిశంకర్ తో అన్ని ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.
రాష్ట్రంలో బొగ్గు కొరత లేదు
- తెలంగాణం
- October 12, 2021
లేటెస్ట్
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!