అక్ర‌మంగా రేష‌న్ బియ్యం నిల్వలు‌.. ఇద్ద‌రు అరెస్ట్

అక్ర‌మంగా రేష‌న్ బియ్యం నిల్వలు‌.. ఇద్ద‌రు అరెస్ట్

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన దాదాపు 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఆదివారం ఎస్ ఓ టి పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. మల్కాజిరి సర్కిల్ పరిధిలోని సాయి నగర్ కు చెందిన షేక్ గులాబ్ (60) బిజెఆర్ నగర్ కు  చెందిన‌ షేక్ ఇర్ఫాన్ లు కలిసి,  కొంతమంది వ్యక్తులను పెట్టి ఆయా ప్రాంతాల నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి సేకరిస్తుంటారు. త‌క్కువ ధరకు కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని పెద్ద మొత్తాలలో నిల్వ ఉంచి రైస్ మిల్లులకు, ఇతర కంపెనీలలో ఎక్కువ ధరకు అమ్మకాలు జరుపుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో ఎస్ ఓ టి పోలీసులు దాడి చేశారు. రేషన్ బియ్యంతో పాటు ఇద్దరు నిందితులు షేక్ గులాబ్, షేక్ ఇర్ఫాన్ ల‌ను అదుపులోకి తీసుకొని మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు.

SOT police arrest two persons for illegally storing ration rice in Malkajgiri