పిలిసినంక రాకుంటే ఎట్ల సెప్పండ అందికే వస్తా ఉండా!

పిలిసినంక రాకుంటే ఎట్ల సెప్పండ అందికే వస్తా ఉండా!

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన ‘సుధీర్ బాబు’ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ముందుకెళుతున్నాడు. ఇటీవలే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే చిత్రం అంతగా ఆడలేదు. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ‘హంట్’ సినిమా ఇంకా సెట్స్ మీదనే ఉండగా.. మరో చిత్రానికి సైన్ చేశాడు. సుమంత్ జి నాయుడు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ 31వ తేదీన ‘సుధీర్ బాబు’ మాస్ సంభవం లోడింగ్ అవుతుందని చిత్ర బృందం వెల్లడించింది. జ్ఞానసాగర ద్వారక దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన విషయాలను వినూత్నంగా ప్రకటించింది.

ఎప్పుడూ చూడని మాస్ పాత్రలో సుధీర్ బాబు కనిపించనున్నాడని తెలిపింది. ఈ మేరకు ఓ ఫొటోను రిలీజ్ చేసింది. పోస్టు కార్డుపై ఓ దేవాలయం ఉంది. సుబ్రమణ్యం, s/o శివారెడ్డి, పాలస్ రోడ్, కుప్పం, చిత్తూరు జిల్లా చిరునామ రాసి ఉంది. పోస్టు కార్డుపై ఓ పిస్టల్, పోన్, రూ. 500 నోట్ ఉంది. నటుడు సుధీర్ బాబు కూడా ఓ ట్వీట్ చేశాడు. ‘పిలిసినంక రాకుంటే ఎట్ల సెప్పండ అందికే వస్తా ఉండా!‘ ట్వీట్ లో తెలిపారు. దీనిని బట్టి రాయలసీమ నేపథ్యంలో సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.