భారీ ఉగ్రదాడులు జరిగే అవకాశం : నిఘా వర్గాల హెచ్చరిక

భారీ ఉగ్రదాడులు జరిగే అవకాశం : నిఘా వర్గాల హెచ్చరిక

అయోధ్య కేసులో తీర్పు వచ్చిన క్రమంలో భారత్ లో భారీ ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అయోధ్య తీర్పు ఏ క్షణమైనా వెలువడనుందన్న వార్తలు వచ్చిన దగ్గరి నుంచి జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కదలికలు తీవ్రమయ్యాయి.

ఇప్పుడు తీర్పు రావడంతో భారీ దాడులకు పాల్పడేందుకు రెడీగా ఉందని ఐబీ, రా సంస్థలు హెచ్చరించాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలపై దాడులు జరగవచ్చని తెలిపాయి.