
భద్రాచలం, వెలుగు : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ రేంజ్లో 2024 సంవత్సరంలో ఇప్పటి వరకు జరిపిన వివిధ ఆపరేషన్లలో 91 మంది మావోయిస్టులు చనిపోయారని బస్తర్ రేంజ్ఐజీ సుందర్ రాజ్ పి బుధవారం తెలిపారు. అబూజ్మాఢ్ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు చనిపోయిన తర్వాత ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. మావోయిస్టు కార్యకలాపాలు దేశంలోనే అత్యధికంగా ఉండే ఈ ప్రాంతంలో పట్టు సాధించామన్నారు. అత్యాధునిక ఎల్ఎంజీ ఆయుధాలు రెండు, ఏకే-47లు నాలుగు , ఎస్ఎల్ఆర్లు ఒకటి, ఇన్సాస్లు మూడు, 303 రైఫిల్స్ నాలుగు , 9ఎంఎం పిస్టల్స్ నాలుగు, మందుపాతరలు, డిటోనేటర్లు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. యాంటీ మావోయిస్టు ఆపరేషన్లు ఇంకా కొనసాగుతాయని చెప్పారు.