- నారాయణ్ పూర్ లో ప్రారంభించిన ఛత్తీస్ గఢ్ ..
- డిప్యూటీ సీఎంహోం మినిస్టర్ విజయ్ శర్మ
- 15వ తేదీ నాటికి కర్రెగుట్టలు చేరుకోనున్న యాత్ర
భద్రాచలం, వెలుగు : బస్తర్ దండకారణ్యంలోని మావోయిస్టుల కంచుకోట నారాయణ్పూర్ నుంచి కర్రెగుట్టల వరకు తిరంగా యాత్ర చేపట్టారు. ఛత్తీస్ గఢ్ డిప్యూటీ సీఎం, హోంమంత్రి విజయ్శర్మ, అటవీశాఖ మంత్రి కేదార్కశ్యప్కలిసి బుధవారం నారాయణ్ పూర్ లో బైక్ ర్యాలీని ప్రారంభించారు.
మొదటి రోజు నారాయణ్పూర్ నుంచి దౌడాయి, కన్హార్గావ్, కోడెనార్, బోదలీ, సాత్ధార్, బార్సూర్, గీదం, దంతెవాడ వరకు యాత్ర జరిగింది. 15వ తేదీ ఉదయం నాటికి బైకర్లు కర్రె గుట్టలకు చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
విద్యార్ధులు, ఎన్సీసీ కేడెట్లు, మహిళా బైకర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే మావోయిస్టుల మందుపాతర పేలుళ్లు, దాడి జరిగిన ప్రదేశంలో మట్టిని సేకరిస్తున్నారు. ఆ మట్టిని స్మృతి స్తూపంలో పొందుపరిచి భావితరాలకు వివరించేలా యాత్రను చేపట్టారు.
