నాటేసిన పొలం దున్నేసిన్రు 

నాటేసిన పొలం దున్నేసిన్రు 

ఇందల్వాయి, వెలుగు: నాట్లు వేసిన 5 ఎకరాల వరి పొలాన్ని వీడీసీ సభ్యులు 5 ట్రాక్టర్లతో ధ్వంసం చేయించారు. మంగళవారం బాధితుడు రాజేశ్వర్‌‌‌‌ మండల కేంద్రంలో ప్రెస్‌‌‌‌మీట్​లో మాట్లాడారు. 15 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన చిన్న గంగాగౌడ్‌‌‌‌ నుంచి 2182 సర్వే నంబర్​లో 10 ఎకరాల 20 గుంటల భూమిని కొనుగోలు చేశానని చెప్పారు. ఇటీవల గంగాగౌడ్‌‌‌‌ వారసులు వివాదం ఉన్న 2181 సర్వే నంబర్​ను అడ్డుపెట్టుకుని తన భూమి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. వీరు వీడీసీ తో కలిసి కొన్ని నెలలుగా తనని ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. వీడీసీ తనను రూ. 3 లక్షలు జరిమానా కట్టాలని డిమాండ్‌‌‌‌ చేసిందని, అందుకు నిరాకరించడంతో కులం నుంచి వెలి వేశారన్నారు. సోమవారం గంగాగౌడ్‌‌‌‌ వారసులు, వీడీసీ సభ్యులు పొలాన్ని ధ్వంసం చేశారని చెప్పారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పలువురి పై కేసులు నమోదు చేశామని ఎస్సై గౌరిందర్‌‌‌‌ గౌడ్‌‌‌‌ వెల్లడించారు.