ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ భౌతికకాయానికి కొందరు ప్రముఖులు నివాళులర్పించారు. నిజాముద్దీన్లోని షీలాదీక్షిత్ నివాసంలో ఈ ఉదయం బీజేపీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఇతరులు షీలాదీక్షిత్ పార్థివ దేహానికి నివాళులర్పించి సంతాపం తెలిపారు. కొంతకాలం పాటు అనారోగ్యంతో బాధపడిన షీలా దీక్షిత్.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు చూసేందుకు ఆమెకు కడసారి నివాళులు అర్పిస్తున్నారు. ఆమె ఇంటి నుంచి ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ కు పార్థివదేహం తరలించారు. పార్టీ ఆఫీస్ లో సీనియర్ నాయకులు నివాళులు అర్పించారు.