చెన్నూరులో ఉద్రిక్తత.. కర్రలతో రోడ్డెక్కిన టీఆర్ఎస్ కార్యకర్తలు

చెన్నూరులో ఉద్రిక్తత.. కర్రలతో రోడ్డెక్కిన టీఆర్ఎస్ కార్యకర్తలు

మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఉద్రిక్తత ఏర్పడింది.  TRS ను తిట్టే వాళ్ళను ఏమైనా చేయండి.. తాను అండగా ఉంటానని రైతు ధర్నాలో  MLA బాల్క సుమన్ పిలుపునిచ్చిన రెండు రోజుల్లోనే.. చెన్నూరులో టెన్షన్ నెలకొంది. పట్టణంలో TRS  కార్యకర్తలు హల్ చల్ చేశారు. 

BJP పై ఎమ్మెల్యే బాల్కాసుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా... చెన్నూర్ పట్టణానికి OU JAC  హైదరాబాద్ విద్యార్థులు వస్తున్నారన్న సమాచారంతో... వారిని అడ్డుకోడానికి పెద్ద ఎత్తున మోహరించరు TRS కార్యకర్తలు.  MLA క్యాంపు కార్యాలయం ఎదురుగానే కర్రలు పట్టుకొని నిలబడ్డారు. అంతటితో ఆగకుండా వాహనాలు ఆపి తనిఖీలు చేశారు.

పట్టణ BJP టౌన్ అధ్యక్షులు సుశీల్ కుమార్ ఇంటిపై దాడికి యత్నించారు. బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.గొడవలు జరుగకుండా వుండడానికి చెన్నూరు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 15 మందిని ముందస్తు అరెస్టు చేసిన స్టేషన్ కు తరలించారు. గొడవ సద్దుమణిగాక బీజేపీ నేతలను వదిలేశారు పోలీసులు. అయితే దాడి చేసిన వారిని వదిలి బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు బీజేపీ నేతలు. .