రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : కేటీఆర్

రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : కేటీఆర్

తెలంగాణ రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి కేటీఆర్‌. రైతు రుణమాఫీకి రూ. 1200 కోట్ల విడుదలకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారని…దీంతో రైతు రుణమాఫీ కింద 5.50 లక్షల మంది లబ్ది పొందుతారన్నారు. దీనికి సంబంధించి ట్విట్టర్ ట్వీట్ చేశారు కేటీఆర్. వానాకాలం రైతుబంధుకు కూడా రూ. 7 వేల కోట్ల విడుదల చేయడంతో ఈ పథకం కింద 57 లక్షల మందికి లబ్ది చేకూరనుంది. రైతుల ఖాతాల్లో రెండు, మూడు రోజుల్లో నగదు జమ కానుందని కేటీఆర్‌ తెలిపారు.

రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవడానికి రూ. 25 వేల లోపు ఉన్న రుణాలను ఒకేసారి మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నగదును గురువారం ఆర్థిక శాఖ విడుదల చేసింది. రుణమాఫీ సొమ్మును రైతులకు చెక్కుల రూపంలో అందించాలని ప్రభుత్వం ముందుగా భావించింది. అయితే… ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుండటంతో రైతుల ఖాతాల్లోకే డబ్బులను నేరుగా బదిలీ చేయాలని నిర్ణయించిందన్నారు.