కూతురు మృతిని తట్టుకోలేక గోదావరిలో దూకిన తల్లిదండ్రులు

కూతురు మృతిని తట్టుకోలేక గోదావరిలో దూకిన తల్లిదండ్రులు
  •     బూర్గంపహాడ్​ వద్ద డెడ్​బాడీలు లభ్యం

బూర్గంపహాడ్, వెలుగు: కూతురు మృతిని తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్​లోని ఈసీఐఎల్​లో ఏరియాకు చెందిన షమ్మి లక్ష్మణాచారి(55), హేమలత(48) భార్యాభర్తలు. వీరి ఒక్కగానొక్క కూతురు సాత్విక. 3 నెలల క్రితం సాత్విక అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మణాచారి, హేమలత భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలోని సమీప బంధువు వేమనకుమార్ వద్ద ఉంటున్నారు. బుధవారం పాప దగ్గరికి వెళ్తున్నాం.. మా కోసం వెతకకండి అని సూసైడ్ లెటర్ రాసి ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆచూకీ దొరకకపోవడంతో వేమనకుమార్ గురువారం పాల్వంచ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాయంత్రం బూర్గంపహాడ్ శివారులోని పంప్ హౌజ్ వద్ద గోదావరిలో ఇద్దరి మృతదేహలు దొరికాయి.