హోమ్ ఐసొలేషన్ పై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ

హోమ్ ఐసొలేషన్ పై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ

వైద్య పరీక్షల్లో తక్కువ కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు తేలిన వారిని, ప్రీ-సింప్టమ్స్ కనిపిస్తున్న వారిని  మొదట హోమ్ ఐసొలేషన్ లో ఉండాలని సూచించింది ఆరోగ్య శాఖ. ఇలాంటి వారికి కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మరిన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.

వైద్య పరీక్షల్లో తక్కువ స్థాయిలో కరోనా లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణ అయిన వ్యక్తులు.. డాక్టర్ పరిశీలనలో కరోనా లక్షణాలు ఉన్నట్టు తేలిన వ్యక్తులు హోమ్ ఐసొలేషన్ లో ఉండాలని తెలిపింది. వీరి కుటుంబ సభ్యులు కూడా ఐసొలేషన్ లో ఉండాలని సూచించింది.

అంతేకాదు వీరి మంచి చెడ్డలు చూసేందుకు అన్ని వేళలా ఒక సహాయకుడు అందుబాటులో ఉండాలంది. హోమ్ ఐసొలేషన్ సమయంలో ఆస్పత్రికి, సహాయకుడికి మధ్య కమ్యూనికేషన్ ఉండాలని చెప్పింది.

హోమ్ క్వారంటైన్ లో ఉన్నప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలను కూడా తెలిపింది కేంద్ర వైద్యశాఖ. ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్  సలహా ప్రకారం సహాయకుడితో పాటు క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్నవారు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ప్రొఫైలాక్సిస్ వాడాలి.

మొబైల్ లో ఆరోగ్యసేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అన్ని సమయాల్లో ఈ యాప్ యాక్టివ్ గా ఉండాలి.

ప్రతి పేషెంట్ తన ఆరోగ్యాన్ని చెక్ చేసేందుకు, తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా సర్వైలెన్స్ అధికారికి అందించేందుకు అంగీకరించాలి.

సెల్ఫ్ ఐసొలేషన్ కు సంబంధించిన ఫామ్ ను పూర్తి చేయాలి. హోమ్ క్వారంటైన్ గైడ్ లైన్స్ ను పాటించాలి.