షేవింగ్ చేసుకోనందుకు ఓ ఎస్సైని సస్పెండ్ చేశారు పోలీసు ఉన్నతాధికారులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఇంటెసర్ అలీ బాగ్పత్ ఎస్సైగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గడ్డం చేయించుకోవాల్సిందిగా అధికారులు ఇప్పటికే మూడు సార్లు ఆదేశించారు. కానీ అతను వాటిని పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఇంటెసర్పై సస్పెన్షన్ వేటు వేశారు.
పోలీసు మాన్యువల్ ప్రకారం కేవలం సిక్కులకు మాత్రమే గడ్డం ఉంచుకోవడానికి అనుమతి ఉందన్నారు బాగ్పత్ ఎస్పీ అభిషేక్ సింగ్. మిగతావారందరూ నీట్గా గడ్డం చేయించుకోవాల్సిందేనని చెప్పారు. ఒకవేళ గడ్డం ఉంచుకోవాలనుకుంటే అతను దాని కోసం అనుమతి తీసుకోవాలి. ఈ క్రమంలో ఇంటెసర్ అలీని ఫర్మిషన్ తీసుకోవాల్సిందిగా సూచించామని.. అతడు దానిని పాటించలేదని చెప్పారు. అనుమతి లేకుండా గడ్డం ఉంచుకోవడంతో సస్పెండ్ చేశామని తెలిపారు.
అయితే గడ్డం ఉంచడానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు ఇంటెసర్.. కానీ స్పందన రాలేదన్నారు.