శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుక‌లు

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుక‌లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలో మంగ‌ళ‌వారం నుంచి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాముల వారు మత్స్య, కూర్మ, వారాహ, నరసింహ, వామన, పరుశురామ, శ్రీకృష్ణ, బలరామ అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మంగ‌ళ‌వారం మత్స్య అవతారంలో భక్తులకు కనువిందు చేశారు. కోవిడ్ కారణంగా స్వామి వారి తిరువీధి సేవను రద్దు చేసి… చిత్రకూట మండలంలోనే దర్శనానికి ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. తెప్పోత్సవాన్ని కూడా నిర్వహించడం లేదని చెప్పారు