నర్సాపూర్, వెలుగు: విజిలెన్స్ ఆఫీసర్ లు ఓ రైస్ మిల్ పై రైడ్ చేసి పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం పట్టుకున్నారు. ఈ సంఘటన మంగళవారం మెదక్ జిల్లాలో జరిగింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ పి మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామాల నుంచి దళారుల ద్వారా రేషన్ బియ్యం కొనుగోలు చేసి, తీసుకొచ్చి రీ సైకిల్ చేసి కొత్త బ్యాగుల్లో నింపి అమ్ముతున్నట్టు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు నర్సాపూర్ మండలం , కాగజ్ మద్దూర్ లో శ్రీధర్ గుప్తాకు చెందిన శ్రీ సాయి రైస్ మిల్ పై విజిలెన్స్ అధికారులు రైడింగ్ చేశారు. రైస్ మిల్ ప్రాంగణంలో బియ్యంతో ఉన్న 29 ట్రాలీ ఆటోలను గుర్తించారు. వాటిలో ఉన్న 2 వేల క్వింటాళ్ల బియ్యం సీజ్ చేశారు. రైస్ మిల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు విజిలెన్స్ సీఐ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఇద్దరు విజిలెన్స్ ఎస్సై లతో పాటు, నర్సాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ గంగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
2 వేల క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత ..29 ఆటోలు సీజ్
- తెలంగాణం
- November 16, 2021
లేటెస్ట్
- మోదీ హయాంలో మహిళలకు రక్షణ కరువు: జైరాం రమేశ్
- ఫిజిక్స్ టఫ్.. కెమిస్ట్రీ ఈజీ .. ఈసారి యావరేజ్గా నీట్ పేపర్
- ఎండ వేడిమితో అస్వస్థతకు గురై వ్యక్తి మృతి
- పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు 15,637 మంది ఓటర్లు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికిన దొంగలు కేసీఆర్, కేటీఆర్
- కేసీఆర్ సభ రోజే.. బీఆర్ఎస్కు బిగ్ షాక్
- మతోన్మాద బీజేపీని ఓడించండి: సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్
- అంబానీ, ఆదానీ జేబులు నింపుతున్న మోదీ: జస్టిస్ చంద్ర కుమార్
- బెల్లంపల్లిలో వాకర్స్తో వంశీకృష్ణ
- లింగ వివక్షకు మరో రూపం పింక్ ట్యాక్స్ : బుర్ర మధుసూదన్ రెడ్డి
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..