హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పోస్టల్బ్యాలెట్ఓటింగ్కింద శనివారం నాటికి 32,331 మంది ఓటు హక్కు వినియోగించుకు న్నారు. ఎన్నికల విధుల్లో ఉన్నవాళ్లు, ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అత్యవసర సేవల సిబ్బందికి ఈ సదుపాయం కల్పిం చారు. కాగా, 85 ఏండ్లకు పైగా ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు హోం ఓటిం గ్ సౌకర్యం కల్పించారు. దీనికోసం 23,247 మంది అప్లై చేసుకోగా, 15,637 మంది ఓటు వేశారు.