- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్
హైదరాబాద్, వెలుగు: కరోనాకు భయపడి కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్, సినీ నటి విజయశాంతి బయటకు రావడం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ అన్నారు. కొత్త ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ను కలవకపోవడానికి కూడా అదే కారణం అని చెప్పారు. ఆమె కాంగ్రెస్ను వీడబోతున్నారనే వార్తల్లో నిజం లేదని తెలిపారు. ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న విజయశాంతి దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆమెను కుసుమ కుమార్ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయశాంతికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ చీఫ్ రాహుల్ గాంధీలపై గౌరవం ఉందని, ఆమె పార్టీలోనే ఉన్నారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆమె ఇటీవల కలిశారని, త్వరలో బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం కూడా జరిగింది.