ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు నీట మునిగాయి

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు నీట మునిగాయి

మంచిర్యాల జిల్లా చెన్నూరులో గోదావరి వరదకు నీట ముగినిన పంటలను పరిశీలించారు మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి. స్థానిక రైతులతో ఆయన మాట్లాడారు. పంటలు నీట మునగాడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. కాళేశ్వరంతో పొలాలకు నీళ్లు వస్తాయనుకుంటే .. వేసిన పంటలు మునుగుతున్నాయన్నారు. మూడేళ్లుగా జరిగిన పంట నష్టానికి పరిహారం చెల్లించాలన్నారు వివేక్. 

కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని.. ఆ ప్రాజెక్టుతో మెగా కృష్ణా రెడ్డి ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో చేరాడని అన్నారు. రైతులకు ప్రభుత్వం పరిహారం అందించే వరకు బీజేపీ అండగా వుంటుందని భరోసా ఇచ్చారు వివేక్ వెంకటస్వామి.